ప్రజాశక్తి-విజయవాడ : స్వాతంత్ర్య సమర యోధుడు, భారతదేశ తొలితరం కమ్యూనిస్టు ఉద్యమ నేత, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, గొప్ప మార్క్సిస్టు సిద్ధాంతవేత్త మాకినేని బసవపున్నయ్య 32వ వర్ధంతి విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సినియర్ నాయకులు పి.మధు బసవపున్నయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, వై వెంకటేశ్వరావు, వి ఉమామహేశ్వరరావు, మురళికృష్ణ, తులసీదాస్, అండ్ర మాల్యాద్రి, తులసీరావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
![May be an image of 5 people and temple](https://scontent.fvga1-2.fna.fbcdn.net/v/t39.30808-6/437392324_990906429061897_2381660588087849958_n.jpg?_nc_cat=107&ccb=1-7&_nc_sid=5f2048&_nc_ohc=qmIxsTIuTgcAb5pgcpZ&_nc_ht=scontent.fvga1-2.fna&oh=00_AfDVd2BtxN5NzUw7FwHpA8NuPrXjD74iwvLyN95_HWleuQ&oe=661ED4AF)