ప్రజాశక్తి-శిoగరాయకొండ : అతివేగంతో దూసుకొచ్చిన కారు బాలుడి(3) ప్రాణాలు తీసింది. ఎన్ హెచ్ 16 ఎమర్జెన్సీ లాండింగ్ వద్ద కనమళ్ళ నుంచి బుల్లెట్ పై వస్తున్న తమ కుమారిడితో పాటు భార్యాభర్తలు రోడ్డు క్రాస్ ఆవుతుండగా రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు అతివేగంతో బుల్లెట్ ను ఢీ కొట్టింది. బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. శిoగరాయకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![road accident in singarayakonda](https://prajasakti.com/wp-content/uploads/2023/12/road-accident-in-singarayakonda.jpg)