ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : ఈత సరదా బాలుడు ప్రాణం తీసింది. సత్తెనపల్లి పట్టణానికి చెందిన గుంజి ప్రవీణ్ కుమార్ (10) తల్లిదండ్రులు గుంజి రాంబాబు భవన నిర్మాణ కార్మికుడు గా పనిచేస్తుండుగా తల్లి తిరుపతమ్మ కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుటున్నారు. వీరికి కుమార్తె అమృత వర్షిని 7వతరగతి చదువుతుండగా కొడుకు ప్రవీణ్ కుమార్ 4వతరగతి చదువుతున్నాడు. ఆదివారం పాఠశాలకు సెలవు కావటంతో స్నేహితులతో బాలుడు ఈతకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మఅతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/baludu-dead.jpg)