ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్లో ప్రభాస్ అభిమానులకు ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన నీల్.. క్లైమాక్స్ చివరలో పార్ట్ 2 టైటిల్ ప్రకటించారు. మొదటి పార్ట్కు పార్ట్ా1 ‘సీజ్ ఫైర్’ అని టైటిల్ పెట్టిన ప్రశాంత్.. పార్ట్ా2కు ‘శౌర్యాంగ పర్వం’గా టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవ, వరద శత్రువులుగా ఎలా మారారో రెండో భాగంలో చూపించబోతున్నారు. ఈ మూవీ 2024 డిసెంబర్ లేదా 2025 ప్రారంభంలో విడుదల కానున్నట్టు సమాచారం.