హైదరాబాద్, బెంగళూరులోని ఆస్తులను విక్రయించాలని ప్రముఖ ఐటీ సంస్థ విప్రో నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును కార్యకలాపాల స్థిరీకరణం కోసం వినియోగించాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియా పేర్కొంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని 14 ఎకరాలు, బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న 25 ఎకరాలను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆస్తుల మదింపు కూడా ప్రారంభమైనట్టు సమాచారం. అయితే, ఈ వార్తలపై స్పందించేందుకు విప్రో నిరాకరించింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/11/wipro.jpg)