ప్రజాశక్తి-చిలమత్తూరు : చిలమత్తూరు మండలం కొడికొండ చెక్పోస్ట్ సమీపంలో ఉన్న ఐహెచ్పీ పరిశ్రమలో పని చేస్తున్న రాజస్థాన్ కు చెందిన “అన్నారన్” అనే కార్మికుడు మిషన్ పై నున్న కేబుల్ తగిలి ప్రమాదవశాత్తు క్రింద పడిన ఘటనలో కార్మికుడికి కాలువిరిగింది. యాజమాన్యం కార్మికుడిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించి కార్మికుడిని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటీయు నాయకులు లక్ష్మినారయణ డిమాండ్ చేశారు.
![Injuries to worker in IHP industry](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Injuries-to-worker-in-IHP-industry.jpg)