ప్రజాశక్తి-విజయవాడ : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దుర్మార్గమైన దాడిని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సభకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్ పై విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడం అన్యాయమని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![cpm condemn attack on Andhra Jyoti photographer](https://prajasakti.com/wp-content/uploads/2024/02/cpm-condemn-attack-on-Andhra-Jyoti-photographer.jpg)