పార్టీలోకి చేరిన వారితో కందికుంట వెంకటప్రసాద్
కదిరి అర్బన్ : పట్టణంలోని 18,19వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ ముంతాజ్ తజ్ముల్, తజ్ముల్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆపార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో పెద్ద ఎత్తున వార్డు సభ్యులు, యువకులు,మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫారూఖ్, ఎస్బి.శీన, సలాం, బీడీ ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.