ప్రజాశక్తి-పిడుగురాళ్ల పట్నం : పాఠశాల భవనంపై నుండి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే… పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్నంలోని భాష్యం పాఠశాల నందు పదో తరగతి చదువుతున్న కొనకొండ్ల రుషిత అనే విద్యార్ధి 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. యాజమాన్యం పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
![Tenth class student commits suicide](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Tenth-class-student-commits-suicide.jpg)