హైదరాబాద్ : ఇన్స్ట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ నూతన ఆఫీసు బేరర్ల ఎన్నిక జరిగింది. 2024 ఏడాదికి గాను ఛైర్మన్గా లక్ష్మీ నారాయణ గుప్తా, వైస్ ఛైర్మన్గా మంజీత్ బుచా, సెక్రటరీగా శిల్పా బంగ్, ట్రెజరర్గా పవన్ కంకణి ఎన్నుకోబడ్డారు. సభ్యులుగా తంగిరాల లలితా దేవి, అక్షిత సురాణా, ఎ కార్తిక్, ఎక్స్ అఫీషియో సభ్యులుగా రాజవోలు వెంకట రమణ, మహదేవ్ తిరునగరి ఎన్నికయ్యారు. ఐసిఎస్ఐలో 72,000 మంది సభ్యులు, 2 లక్షల మంది విద్యార్థులు సభ్యత్వం కలిగి ఉన్నారని ఆ సంస్థ తెలిపింది.