న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ఫోన్పే ఈ ఏడాది అక్షయ తతీయ సందర్భంగా క్యాష్బ్యాక్ ఆఫర్ను అందిస్తున్నట్లు తెలిపింది. మే 10న యూజర్లు ఫోన్పే యాప్లో గోల్డ్ను కొనుగోలు చేస్తే రూ.2000 వరకు గ్యారంటీ క్యాష్బ్యాక్ను పొందవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్ను పొందాలంటే కనీసం రూ.1000 విలువ చేసే గోల్డ్ను ఆర్డర్ చేయాలని తెలిపింది. ఇది 24 క్యారెట్ డిజిటల్ గోల్డ్ కొనుగోలుపై ఒకసారి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.