హైదరాబాద్ : ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల సంఖ్యలో 47 శాతం పెరుగదల ఉండొచ్చని రెడ్బస్ అంచనా వేసింది. మే 13న ఒకే విడతలో జరగనున్న ఎన్నికల్లో తమ విలువైన ఓటుని వేసేందుకు ఓటర్లు ఇప్పటికే వారి ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొంది. దీంతో తమ ప్లాట్ ఫామ్లో టిక్కెట్ల బుకింగ్ గణనీయంగా పెరిగిందని రెడ్ బస్ పేర్కొంది. మే 10, 11, 12 తేదీల్లో తమ సొంత ఊర్లకు వెళ్లే వారి సంఖ్య దాదాపు 47 శాతం పెరుగుదల ఉంటుందని రెడ్ బస్ అంచనా వేసింది. బస్ ఆపరేటర్లు రోజుకు 3000 కంటే ఎక్కువ సర్వీసులను నడుపుతున్నారని పేర్కొంది.