న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల బ్రాండ్ బౌల్ట్ కొత్తగా రెండు సౌండ్ బార్స్ను ఆవిష్కరించింది. బౌల్డ్ ప్రవేశపెట్టిన అత్యాదునిక తొలి స్పేస్ ట్రాన్స్ఫార్మింగ్ సౌండ్బార్, బాస్బాక్స్ సౌండ్బార్స్తో ఇంటి వినోదాన్ని విప్లవాత్మకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఇవి 120, 180 ఆర్ఎంఎస్ వేరియంట్లలో లభిస్తాయని ఆ సంస్థ తెలిపింది. వీటి ధరలను వరుసగా రూ.4,999, రూ.5,999గా నిర్ణయించింది. బౌల్ట్ బాస్ బాక్స్ అత్యాధునిక డిజిటల్ సిగల్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో వస్తుందని తెలిపింది.