అంగన్‌వాడీల వినూత్న నిరసన

Jan 2,2024 22:06
ఫొటో : సిఎం మాస్క్‌ ధరించి అంగన్‌వాడీల ప్రశ్నలకు సమాధానం చెబుతున్న ప్రజానాట్యమండలి కళాకారుడు గద్దర్‌బాబు

ఫొటో : సిఎం మాస్క్‌ ధరించి అంగన్‌వాడీల ప్రశ్నలకు సమాధానం చెబుతున్న ప్రజానాట్యమండలి కళాకారుడు గద్దర్‌బాబు
అంగన్‌వాడీల వినూత్న నిరసన
ప్రజాశక్తి-అనంతసాగరం : ప్రజానాట్యమండలి కళాకారుడు గద్దర్‌బాబు సిఎం జగన్‌ మాస్క్‌ ధరించి అంగన్‌వాడీలు అడిగిన ప్రశ్నలకు వినూత్నంగా సమాధానాలు ఇస్తూ నిరసన తెలిపారు. అంగన్‌వాడీల చేపడుతున్న నిరవధిక సమ్మె మంగళవారం 21వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌ బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తమ సమస్యలు వేతనాలు పెంచే విధంగా తమ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికైనా అంగన్‌వాడీలతో చర్చలు జరిపి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీలకు కనీస వేతనాలు పెంచి, గ్రాడ్యుటీని కూడా అమలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కనీస వేతనం తమ డిమాండ్‌ను అంగీకరించే వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు వేము పెంచలయ్య, ఐసిడిఎస్‌ అనంతసాగరం ప్రాజెక్టు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు లక్ష్మి, సునీత, నూర్జహాన్‌, వసుంధర, సుబ్బమ్మ, భాగ్యమ్మ, వెంకట సుబ్బమ్మ, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

➡️