ప్రజాశక్తి – రాయచోటి జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అందిన ప్రజల సమస్యలను అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జెసితోపాటు డిఆర్ఒ సత్యనారాయణ, ఎస్డిసి శ్రీలేఖ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. నిర్ణీత గడువులోపు అర్జీదారుడు సంతప్తిచెందేలా అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఎ, రీఓపెనింగ్ లేకుండా సంతప్తి స్థాయి పెరిగేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/Untitled-6-copy-3.jpg)