ప్రజాశక్తి-చింతాకొమ్మదిన్నె ఆరోగ్యశ్రీ పరిమితి పెంచినట్టు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక మండల ప్రజా పరిషత్ ఆవరణలో నూతన ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ప్రతి కుటుంబానికి రూ.ఐదు లక్షల నుండి రూ.25 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంచడం తనకెంతో ఆనందం తెచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిడిఒ జి.రవికుమార్రెడ్డి, పిహెచ్సి వైద్యులు డాక్టర్ కె.రాఘవేంద్ర, డాక్టర్ సునీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.