ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్ నాయకులు
ఒపిఎస్ అమలు చేయాలని వినతి
ప్రజాశక్తి-విడవలూరు : ఉపాధ్యాయ ఉద్యోగులకు పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విడవలూరు యుటిఎఫ్ నాయకులు శనివారం అన్ని రాజకీయ పార్టీ నాయకులను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఖచ్చితమైన నిర్ణయాలను తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి విశ్వనాధ్, అధ్యక్షులు శ్రీనివాసులు, ఆర్.సీనయ్య, సీనియర్ నాయకులు ఎం.మస్తానయ్య, వెంకటేశ్వర్లు, సురేంద్ర, శ్రీనివాసులు, ప్రసాద్ రాజు, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.
![ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న యుటిఎఫ్ నాయకులు](https://prajasakti.com/wp-content/uploads/2024/02/vidava-1.jpeg)