పజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

ప్రజాశక్తి పులివెందుల రూరల్‌ వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని ప్రభుత్వ పథకాలు ప్రతి పేదవానికి అందుతున్నాయని, నవరత్న పథకాలు మళ్లీ అందాలంటే జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కడప పార్లమెంటు సభ్యులు వైయస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పులివెందులలోని ఆయన నివాసం వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకొని సంబంధించిన అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గడపకు జగనన్న ప్రభుత్వసంక్షేమ పథకాలు అందిస్తున్నాయన్నారు, ప్రతి పేదవాడికీ కార్పొరేట్‌ ఆసుపత్రి తరహాలోఉ చిత వైద్యం అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమన్నారు. అర్హుతున్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కచ్చితంగా అందుతుందని తెలిపారు. జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఎన్నికలు ఆసన్నమవుతున్న తరుణంలో ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి జగన్‌ మోహన్‌ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను విని, వారిచ్చిన అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరింప చేస్తామని హామీ ఇచ్చారు.

➡️