రాజాం మెయిన్‌ రోడ్ల పనులు పూర్తి చేయాలంటూ… సిపిఎం రాస్తారోకో

రాజాం (విజయనగరం) : రాష్ట్ర ప్రభుత్వం రాజాం మెయిన్‌ రోడ్డులను తక్షణమే పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ రాజాంలో మంగళవారం ఉదయం రాస్తారోకో నిర్వహిస్తూ డిమాండ్‌ చేశారు. రాజాం మెయిన్‌ రోడ్లు పల్లెటూర్లో ఉన్న రహదారుల కంటే అద్వానంగా ఉన్నాయని, రోడ్లు విస్తరణ పేరుతో గత సంవత్సర కాలంగా ప్రజలను తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రహదారులు సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరిగి చాలామంది అంగవైకల్యంతో బాధపడుతున్నారని, కొందరు చనిపోతున్నారని చెప్పారు. వర్షాకాలం వస్తే రోడ్లు మీద అసలు నడిచే పరిస్థితి లేదని, ప్రజలు ప్రయాణికుల సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే రోడ్లు విస్తరణ పనులు చేపట్టి రోడ్లను వేయకపోతే సిపిఎం పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో సిపిఎం నాయకులు శంకర్రావు, రామ్మూర్తి నాయుడు, తిరుపతిరావు, సత్యరావు, రమణ, విశ్వనాథం, త్రినాధ, అనిల్‌ కుమార్‌, రాజేష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️