రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించాలి : జనసేన

ప్రజాశక్తి-మదనపల్లి తుపాను ధాటికి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్‌ చౌదరి అన్నారు. గురువారం తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం తహశీల్దార్‌ మహబూబ్‌ చాంద్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాందాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని తెలిపారు. రైతులను ఉదారంగా ఆదుకోవడంలో విఫలమైందన్నారు. మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను కలసి వివరాలు సేకరించారు. ప్రకతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఉదారంగా అదుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె మండలలోని రైతంగం తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వ్యవసాయాధికారులు అప్పుడప్పుడు వెళ్లి చూడటమే కానీ, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు కూడా రైతుల దుస్థితి తెలుసుకుని పరామర్శించిన దాఖలు లేదన్నారు. నష్టపోయిన వరి, టమోటా, ఉద్యానవన, వాణిజ్య పంటలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ్‌, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్‌, రూరల్‌ మండల అధ్యక్షులు గ్రానైట్‌ బాబు, రెడ్డెమ్మ, జంగాల గౌతమ్‌, జయ, నవాజ్‌, నాగ, లవన్న, జనార్దన్‌, రాజారెడ్డి, పవన్‌, నాగవేణి, మజ్జల నవీన్‌, ఆదినారాయణ పాల్గొన్నారు.

➡️