ప్రజాశక్తి-గుంటూరు : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఫ్లైయింగ్ స్క్వాడ్లు నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో రూ.53,400, రూ.1,22,310 విలువైన రాజకీయ బ్యాడ్జీలు, తెనాలి నియోజకవర్గ పరిధిలో వాహనాల తనిఖీల్లో రూ.1,09,700, తాడికొండ నియోజకవర్గ పరిధిలో రూ.56 వేలు నగదుకు సరైన ఆధారాలు చూపకపోవటంతో సీజ్ చేశారు. కాగా జిల్లాలో మార్చి 30వ తేదీ వరకూ రూ.1,26,77,940లు సీజ్ చేయగా, ఇప్పటి వరకూ రూ.1,29,65,950లు సీజ్ చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/corency.jpg)