ఫొటో : మాట్లాడుతున్న మేకపాటి రాజగోపాల్రెడ్డి
వలంటీర్లపై వ్యాఖ్యలు అర్థరహితం
ప్రజాశక్తి-ఉదయగిరి : వలంటీర్లపై చంద్రబాబు, పవన్కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థరహితమని నియోజకవర్గం వైసిపి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండల దుత్తలూరులోని నియోజకవర్గం వైసిపి కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రతి పథకాలు ఇంటికి చేరుస్తూ ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు చేసి ప్రాణాలు కాపాడిన వలంటీర్లను విమర్శించడం సరికాదని దుయ్యబట్టారు. అవ్వాతాతలకు ప్రతి నెలా 1వ తేదీ పొద్దున్నే తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వు లతో పించన్లు గడప వద్దకే చేస్తున్నందుకా లేక గతంలొ మీ మాదిరి గా కాకుండా ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాలు గడప వద్దకే చేస్తున్నందుకా వలంటీర్లను విమర్శించడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.