పోలవరం : మండలంలో పోలవరం పంచాయతీలో శనివారం ఉదయం పిండి వరప్రసాద్ చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ బీమా తక్షణ సహాయం కింద రూ.10 వేల నగదును జిల్లా ఎంపిపిల ఛాంబర్ అధ్యక్షులు, పోలవరం ఎంపిపి సుంకర వెంకట రెడ్డి, వైసిపి జిల్లా యూత్ జాయింట్ సెక్రెటరీగా పొడుం శ్యాం కుమార్ల చేతుల మీదుగా శనివారం అందజేసి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వరప్రసాద్ మృతి ఆ కుటుంబానికి తీరనిలోటని, కుటుంబసభ్యులు మనోధైర్యంతో ఉండాలని ఎంపిపి సుంకర వెంకటరెడ్డి అన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/IMG-20231223-WA0092.jpg)