శిశు గృహాన్ని సందర్శించిన జడ్జి

ప్రజాశక్తి-కడప సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ ఎస్‌.బాబా ఫక్రుద్దీన్‌ గురువారం కడప నగరం కొండాయపల్లిలోని శిశు గహాన్ని సందర్శించారు. వేసవి కాలంలో పిల్లల ఆరోగ్యం విషయం పట్ల ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడున్న సిబ్బందికి, అధికారులకు సూచించారు. శిశు గహంలో ఉన్న పిల్లల వివరాలను వారికి అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో పిల్లల ఆరోగ్య విషయాల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాలల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం 2015 వివరించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కడప వారికి సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

➡️