ప్రజాశక్తి-రాయచోటి క్రైం సమగ్ర దర్యాప్తుతో కేసులు పరిష్కారమవుతాయని, కేసుల నమోదు మొదలు న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు వరకు ప్రతి అంశాన్ని పరిశీలిం చాలని ఎస్పి బి.కృష్ణారావు అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పురోగతి సాధించి పరిష్కరించాలని సూచించారు. కోర్ట్లో స్పీడ్ ట్రయిల్ మానిటరింగ్ ద్వారా కేసులలోని నిందితులకు తగిన శిక్షపడేలా కషి చేయాలని తెలిపారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకోని రికవరీ శాతాన్ని పెంచాలని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యక్రమాలను కట్టడి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లో పరిధిలో పలు కేసులను సమీక్షించి, తీవ్ర నేరాలతో వున్న కేసుల దర్యాప్తు వివరాలు, కోర్ట్లో చార్జిషీట్ దాఖలు, ప్రస్తుతం కోర్టులో ట్రయల్ ఏ దశలో ఉన్నాయి వంటి వివరాలు అడిగి తెలుసుకొని, సంబంధిత సీడీ ఫైల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య, రేప్, పోక్సో, ప్రాపర్టీ, గంజాయి మున్నగు గ్రేవ్ కేసుల్లో దర్యాఫ్తు, ముద్దాయిలు అరెస్టు లపై సర్కిల్ వారీగా పోలీసు అధికారులను ఆరా తీసి, అపరిష్కతంగా ఉన్న గ్రేవ్ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పురోగతి సాధించి పరిష్కరించాలనిమ పేర్కొ న్నారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాహన తనిఖీలు చేపట్టి చలానాలు విధిస్తూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ వర్క్పై దష్టి సారించాలని, రాత్రి గస్తీ పెంచి ఆస్తి నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, చోరీ సొత్తు రికవరీ పెంచాలన్నారు. పోలీసుస్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సమస్యలను ఓపికగా విని, ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం కలిగే విధంగా సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి డాక్టర్ బి.బి.రాజ్ కమల్, డిఎస్పిలు, సిఐలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-5-copy-17.jpg)