25న సూర్యకళా మందిర్ లో రాష్ట్రస్థాయి పాటల పోటీలు

Dec 11,2023 15:39 #Kakinada
  • స్వరాభిషేకం బ్రోచర్ విడుదల

ప్రజాశక్తి-కాకినాడ : ఘంటసాల జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25న సూర్యకళా మందిర్ లో ఘంటసాల కళాపీఠం నిర్వహించ తలపెట్టిన విద్యార్థుల రాష్ట్ర స్థాయి పాటల పోటీలు, స్వరార్చన ఏర్పాట్లు గురించి సోమవారం స్థానిక పెన్షనేర్స్ అసోసియేషన్ బిల్డింగ్ వద్ద అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక పాలక మండలి సభ్యులు, ఘంటసాల కళా పీఠం సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కళావేదిక అధ్యక్షుడు కర్రి అచ్యుత రామా రెడ్డి అధ్యక్షత వహించగా, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు మాట్లాడుతూ 25వ తేదీన సంస్థ నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. సంస్థలో సభ్యుల నమోదు, సంస్థ భవన నిర్మాణానికి స్థల సేకరణ, సంస్థ చేపట్టిన సర్ అర్థర్ కాటన్ దొర విగ్రహ ప్రతిష్టాపన గురించి తీసుకుంటున్న చర్యలు సభ్యులకు వివరించారు. సంస్థ ఉపాధ్యక్షులు కర్రి భామిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ యెస్.వి.వి.యెస్.ఎన్. మూర్తి, సభ్యులు కె.సత్యమూర్తి, మార్ని జానకి రామ చౌదరి తమ తమ ప్రసంగాలలో కార్యక్రమాలు విజయవంతం చేయడానికి తగు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సమావేశానికి సభ్యులు టి.వి.వి.యెస్.ఎన్. రెడ్డి, యెస్.వి.రమణ, కరకా రాజబాబు, ఏం.రామకృష్ణ, పి. వెంకటేశ్వర రావు, ఎన్. కృష్ణకాంత్, పి.శ్రీనివాస్, సిహెచ్ కృష్ణవేణి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

➡️