8న ‘చలో విజయవాడ’

Feb 6,2024 21:43
ఫొటో : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు
8న ‘చలో విజయవాడ’
ప్రజాశక్తి అనంతసాగరం : ఆశావర్కర్లకు కనీస వేతనం, బీమా సౌకర్యం, రిటైర్మెంట్‌ బెనెఫిట్స్‌, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఫిబ్రవరి 8న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఐటియు నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఆశావర్కర్ల యూనియన్‌ సమావేశంలో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌ బాషా పాల్గొని మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావర్కర్లపై విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. రూ.10వేల వేతనంతో 24 గంటలు వెట్టి చాకిరి చేపిస్తున్నారని, ఇతర శాఖల సిబ్బంది చేయాల్సిన పనులను బెదిరించి ఆశావర్కర్లతో చేయిస్తున్నారని తెలిపారు. విధి నిర్వహణలో నెలకు రూ.3వేల నుండి రూ.4వేలు చేతిడబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ ఫోన్లు పనిచేయకపోవడంతో సొంత ఫోన్లు కొని పని చేయాలని లేకుంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని అధికారుల బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. అధికార పూర్వకంగా నాలుగు యాప్‌లు అనధికారికంగా 10యాప్‌ల ద్వారా పనిచేయిస్తున్నారని తెలిపారు. ఆన్‌లైన్‌ వర్క్‌తో పాటు 26 రకాల రికార్డ్‌ కొని రాయాలని హింసిస్తున్నారన్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఆశావర్కర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆశా వర్కర్లకు రూ.10లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, సెలవులు, వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు, అలాగే రిటైర్‌ అయిన వారికి రిటైర్డ్‌ బెనెఫిట్స్‌ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశావర్కర్లకు వర్తింపజేయాలన్నారు. పలు సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 8న విజయవాడలో జరిగే మహాధర్నాలో ఆశా వర్కర్లు అధిక పాల్గొని జయప్రదం చేయాలి కోరారు. కార్యక్రమంలో ఆశావర్కర్స్‌ యూనియన్‌ మండల అధ్యక్ష కార్యదర్శులు ప్రమీల, ధనమ్మ, వసంత, జ్యోతి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

➡️