వేమూరు (బాపట్ల) : వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు జగనన్న కాలనీలో నిర్మించుకుంటున్న గృహాన్ని మోటార్ తో తడుపుకుంటూ ఉండగా విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో గ్రామంలోని దళితవాడకు చెందిన కట్టుపల్లి ప్రేమ్ చంద్ (26) అనే యువకుడు నిర్మించుకుంటున్న గృహానికి విద్యుత్తు లైన్ పై వైర్లు వేసి మోటార్ ద్వారా గృహాన్ని తడుపుకొని అనంతరం లైన్ పై ఉన్న వైర్లను తొలగిస్తుండగా విద్యుత్ షాకుకు గురై మృతి చెందాడు. ఈ ఘటనను విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.