పేరుకుపోతున్నా నీటి పన్ను బకాయిలు

Mar 27,2024 15:53 #Vizianagaram, #water

20 శాతం దాటని పన్నులు వసూలు
576 లక్షలకు , 105 లక్షలు వసూలు

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరపాలక సంస్థ ఆధాయానికి గండి పడుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. విజయనగరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి పన్ను వసులు నామ మాత్రంగానే వసూలు అవుతున్నాయి. ప్రతి ఏడాది నీటి పన్ను ద్వారా నగర పాలక సంస్థ కు 176.25 లక్షలు వసూలు కావాల్సి ఉంది. గత కొంత కాలంగా కట్టాల్సిన పన్నులు బకాయిలు 4.4 కోట్లు లక్షలు వసూలు కావాల్సి ఉంది. ఈ ఏడాది పన్నుతో కలుపుకొని మొత్తం నగర పాలక సంస్థ కు రావాల్సిన నీటి పన్ను బకాయిలు 5.76 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ప్రతి నీటి పన్నులు వసులల్లో పురోగతి కనిపించడం లేదు.ప్రతి ఏడాది వసూలు కావాల్సిన పన్నులు కేవలం 50 శాతం వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది.మిగిలిన బకాయిలు కింద పేరుకుపోయి ఈ ఏడాది మార్చి నాటికి పాత బకాయి .4.70 కోట్లు కు పెరిగింది. పోనీ ఈ ఏడాది అయినా వసులలో పురోగతి ఉందా అంటే అధి లేదు. పాత బకాయిలు 4 కోట్లు కు గాను కేవలం 29 లక్షలు వసూలు చేయడం జరిగింది. ఈ ఏడాది నీటి పన్ను వసులలో 176 లక్షలకు గాను ఇప్పటి వరకు 76 లక్షలు మాత్రమే వసూలు చేయడం జరిగింది.అంటే పాత బకాయి 4 కోట్లు, ఈ ఏడాది వసూలు ఇంకా వసూలు కావల్సింది మరో కోటి రూపాయిలు,అంటే వచ్చే ఏడాదికి పాత బకాయి కింద మరో 4.70 కోట్లకు పన్నులు బకాయిలు పెరగనున్నాయి. ఈ ఏడాది బకాయి, ఈ ఏడాది ది కలిపి 5.76 కోట్లు వసూలు కావాల్సి ఉండగా దానిలో కేవలం 105 లక్షలు వసూలు చేయడం జరిగింది. మొత్తం కలెక్షన్ లో 20 శాతం కూడా నీటి పన్ను వసూలుకు నోచుకోలేదు. గతంలో పన్నులు వసూలు కు కేవలం పదులు సంఖ్యలో ఉండే రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు,బిల్డింగ్ ఇన్స్పాక్టర్లూ మాత్రమే వసూలు చేసేవారు.పని భారం ఎక్కువుగా ఉండటం కారణంగా పూర్తి స్థాయిలో వసూలు వసూలు చెయ్యలేకపో యేవారు. కానీ వార్డు స్థాయిలో సచివాలయం లు వ్యవస్థ ఏర్పడిన తర్వాత నగరం 59 సచిబలయాలు ఉన్నాయి.సచివాలయంలో రెవెన్యూ విభాగం కార్యదర్శులు కూడా అన్ని సచివాలయంలో ఉన్నారు. వారికి కూడా పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత ఉంది. పన్నులు వసూలు కు సరిపడా సిబ్బంది ఉన్న పన్నులు వసూలు కాకపోవడం ఆలోచించాల్సిన విషయం. ప్రతి సచివాలయం పరిధిలో పన్నులు వసూలు కూడా పెద్ద సమస్య కాదు.కానీ కార్యదర్శులు పన్నులు వసూలు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడం, ఇళ్లలో పన్నులు కట్టాల్సిన లేని సమయంలో ఉదయం 11 గంటలకు పన్నులు కు ఇళ్లకు వెళ్ళడం, ఎవ్వరూ లేకపోవడంతో పన్నులు వసులు కాకపోవడం జరుగుతుందని తెలుస్తుంది. నగరపాలక సంస్థ అధికారులు పదే పదె పన్నులు వసూలు పై హెచ్చరించిన పురోగతి లేదంటే పన్నులు వసూలు పై సిబ్బందికి ఉన్న శ్రద్ద ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇదే పరిస్తితి కొనసాగితే నగర పాలక సంస్థ కు రావాల్సిన ఆదాయానికి పూర్తి స్థాయిలో గండి పడే అవకాశం ఉంది. ఈ ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పన్నులు వసూలు పై ఒత్తిడి తేవడంలో కూడా అధికారులు , సిబ్బంది వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదే పరిస్ఠితి నగర పాలక సంస్థ లో కొనసాగితే నీటి పన్ను బకాయి ఏడాదికి ఏడాది పెరుగుతూ పోతుంది తప్ప వసూళ్లు పూర్తి స్థాయిలో జరిగేందుకు అవకాశం లేదు.అధికారులు దృష్టి సారింకాకపోతే నగర పాలక సంస్థ కు మరింత నష్టం జరిగి,నగర పాలక సంస్థ ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.

➡️