వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే చర్యలు

ప్రజాశక్తి-గంపలగూడెం: జరగనున్న ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరు చేసిన చట్టపరమైన చర్యలు చేపడతామని స్థానిక ఎస్సై ఎస్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి మంగళవారం గాదె వారి గూడెంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముందుగా గ్రామంలో సిఐఎస్ బలగాలతో కవాతు నిర్వహించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తామన్నామని ప్రజలకు భరోసా కల్పించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఏ పార్టీ విషయమైనా ఎవరు వివాదాస్పదంగా మాట్లాడొద్దని వివరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని, ఈ సందర్భంగా శ్రీనివాస్ కోరారు.

➡️