టిబి కేసుల సంఖ్య తగ్గించేందుకు అడల్ట్‌ బిసిజి టీకా

క్రోసూరు:  జాతీయ టిబి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు 2025 వ సంవత్సరం నాటికి క్షయ వ్యాధిని అంతం చేయడానికి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి బలహీనమైన వ్యక్తులకు,పెద్ద వయసు ఉన్నవారికి బీసీజీ టీకాను ఇవ్వాలని నిర్ణయించినట్లు పల్నాడు జిల్లా కోసూరు మండలం క్రోసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని బాల అంకమ్మ బారు గురువారం తెలిపారు టిబి వ్యాధి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న పెద్ద వయసు ఉన్న వారికి బిసిజి టీకా ఇవ్వడం ద్వారా సమాజంలో కొత్త టిబి కేసుల సంఖ్య తగ్గింపు జరుగు తుందన్నారు ఈ వయోజన బీసీజీ టీకా వేయించుకోవడానికి అర్హులైన వారి గురించి ఆమె వివరించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, 60 సంవత్సరముల వయసు దాటిన వారు అందరూ, గత ఐదు సంవత్సరముల క్రితం 18 సంవత్సరములు నిండిన టీబి వ్యాధికి గురైన వారు, 1 జనవరి 2021 తర్వాత టిబి వ్యాధికి గురైన వారి కుటుంబ సభ్యులకు ,వారితో అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి, బాడీ మాస్‌ ఇండెక్స్‌ 18 కేజీలు/చదరపు మీటరు కన్నా తక్కువ ఉన్నవారికి, గతంలో గాని ఇప్పుడు గాని పొగతాగే అలవాటు ఉందని స్వచ్ఛందంగా తెలిపిన వారికి ఈ అడల్ట్‌ బిసిజి టీకా కు అర్హులని అన్నారు. ఈనెల 30వ తేదీ గురువారం మండలంలోని అన్ని సచివాలయాల్లో మళ్లీ ఈ వయోజనుల బీసీజీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్‌ మాట్లాడుతూ వయోజన బీసీజీ టీకా వేయించుకోవడానికి అర్హులు కాని వారి గురించి ఆయన వివరించారు. 18 ఏళ్ల లోపు వయసు ఉన్న వ్యక్తులు, హెచ్‌ఐవి సోకిన వారు, గర్భ వతులు, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు, డయాలసిస్‌ కానీ క్యాన్సర్‌ వ్యాధికి చికిత చేయిం చుకుంటున్న వారు ఈ వ్యాక్సిన్‌ వేయించుకోకూడదని అన్నారు. ఈ వయోజన బీసీజీ టీకా కోసం ప్రతి సచివాలయం ఆరోగ్య కార్యకర్తను గాని ఆశా కార్యకర్తను గాని సంప్రదించాల్సిందిగా సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️