మళ్లీ ఏనుగులు హల్‌చల్‌

Jun 30,2024 21:40

జొన్నతోట ధ్వంసం 

ఖాళీ చేసిన ధాన్యం బస్తాలు

ప్రజాశక్తి – జియ్యమ్మవలస : ఏజెన్సీలో మళ్లీ ఏనుగులు హల్‌చల్‌ చేశాయి. ఇటీవల తోటపల్లి సమీపాన ఒక ఏనుగు అస్వస్థతతో మృతి చెందింది. అప్పటి నుండి మండలంలోని కుదమ, పరజపాడు పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారు జామున పరజపాడుకు చెందిన తంగుడు సింహాచలం అనే రైతు ధాన్యం నిల్వ ఉంచుకొన షెడ్‌ను విరగ్గొట్టి ధాన్యం బస్తాలను తినేశాయి. ఇదే గ్రామానికి చెందిన గుంట్రెడ్డి నాగభూషణరావుకు చెందిన జొన్న తోటను ధ్వంసం చేశాయి. రామకృష్ణ, సీతారాం నాయుడు కల్లాల్లో ధాన్యం బస్తాలను చిందరవందర చేశాయి. ఏనుగులు తరలించే ప్రయత్నాన్ని చేయలేని అధికారులు, కనీసం ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ట్రాకర్ల సంఖ్యలు పెంచి ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

➡️