రాయదుర్గం (అనంతపురం) : రాయదుర్గం పట్టణం కోటలో జంబుకేశ్వర స్వామి గుడి సమీపాన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పక్కనే ఉన్న మీటర్ నుండి బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఒక్కసారిగా నిప్పంటుకుంది. ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉండడంతో ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరెంట్ అధికారులు తక్షణమే స్పందించి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.