కలెక్టర్ ఎం.గౌతమి
అనంతపురం కలెక్టరేట్ : ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన సమయంలో ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు గుర్తింపు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డులను చూపించాలని కలెక్టర్ ఎం.గౌతమి తెలియజేశారు. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డుల విషయంపై గురువారం ఆమె పలు విషయాలను ఓటర్లకు తెలియజేశారు. ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ప్రత్యామ్నాయంగా ఫొటో గుర్తింపు కార్డులను చూపించవచ్చన్నారు. ఆధార్ కార్డ్, ఉపాధి జాబ్ కార్డ్, బ్యాంక్,పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్బుక్లు, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, స్మార్ట్ కార్డ్, భారతీయ పాస్పోర్ట్ తదితర 12 రకాల గుర్తింపు కార్డులు చూపించి ఓటు వేయవచ్చన్నారు.