ఆత్మకూరులో బంద్ విజయవంతం

Feb 16,2024 11:43 #Anantapur District

ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సిపిఎం మండల కార్యదర్శి శివ శంకర్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించిన మూడు వ్యవసాయ చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేయాలని, పంటలకు కనీస ధర గ్యారెంటీ చేసే చట్టాన్ని తెస్తామని, 2021 విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని రైతు ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతు సంఘాలు ఆగ్రహించాయి. దీంతో రైతులు దేశ వ్యాప్తంగా మళ్లీ ఉద్యమించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నల్ల చట్టాల రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ పీ ఆర్డి జిల్లా కార్యదర్శి రామయ్య అంగన్వాడి జిల్లా కార్యదర్శి రమాదేవి మధ్యాహ్నం జిల్లా సహాయ కార్యదర్శి జయమ్మ ఐద్వా మండల కార్యదర్శి కృష్ణవేణి అధ్యక్షురాలు రాజేశ్వరమ్మ అంగన్వాడి మండల కార్యదర్శి విజయలక్ష్మి వెంకటమ్మ పంచాయతీ కార్మికులు లక్ష్మీదేవి శివమ్మ తదితరులు పాల్గొన్నారు

➡️