స్మశాన వాటికలో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాటు

Feb 24,2024 14:58 #anathapuram, #muncipal workers

ప్రజాశక్తి అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని ముస్లిం స్మశాన వాటికలో ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం ఆదేశించారు. డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి తో కలిసి శనివారం స్మశాన వాటికలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆదివారం శబ్ ఏ బరత్ పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ముస్లింలు స్మశాన వాటికలో ప్రార్థనలకు హాజరవుతారని వారు వెల్లడించారు. దీంతో నగరంలోని హౌసింగ్ బోర్డ్ స్మశాన వాటిక ను పరిశీలించారు. ప్రధానంగా నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రిపూట ప్రార్థనలు చేసేందుకు వస్తారని దీంతో పెద్ద ఎత్తున లైటింగ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత ఐదు రోజులుగా పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. నేటి సాయంత్రం లోపు పనులన్నీ పూర్తి చేయాలని తెలిపారు. నగర శివారులోని హెచ్ ఎల్ సి కెనాల్ వద్ద ఉన్న ముస్లిం స్మశాన వాటికలో కూడా పనులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ రిజ్వాన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ ,కార్పొరేటర్లు అబూ , ఇసాక్, రహంతుల్లా, బాబా , శంషుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

➡️