ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పెదలంక, ఓలేరు గ్రామాల్లో ఆదివారం జరిగిన వివాహ వేడుకల్లో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. టిడిపి నాయకులు దేవభక్తుని వినాయక్ కుమార్ కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఓలేరు గ్రామానికి చెందిన కోడూరు లక్ష్మయ్య కుమారుడు రిసెప్షన్లో పాల్గొన్నారు. ఆయన వెంట ఆయా గ్రామాల టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/Battiprolu-1-Nakka-1.jpg)