బీసీ నాయకుల ఆత్మీయ సదస్సు

Mar 27,2024 23:53 ##Minister #meruga #Nagarjuna

ప్రజాశక్తి – సంతనూతలపాడు
మండలంలోని పేర్నమిట్టలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్ నందు వైసిపీ బిసి నాయకుల ఆత్మీయ సదస్సు బుధవారం నిర్వహించారు. సదస్సులో మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున హాజరై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా వైసిపికి ఓట్లు వేసి, వేయించి సిఎంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. బిసి నాయకులు మాట్లాడుతూ ఎంఎల్‌ఎ మేరుగ నాగార్జునను గెలిపించుకోవడానికి కృషి చేస్తామని అన్నారు. సదస్సుకు శాలీవాహన కార్పొరేషన్ డైరెక్టరు పేరాల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. సదస్సులో చీమకుర్తి మునిసిపల్‌ చైర్మన్ జి రాజ్యలక్ష్మి, బీసీ నాయకులు ఎం నాగేశ్వరరావు, మోహన్, గిరి, ఏడుకొండలు, సంజీవరావు, సుబ్రహ్మణ్యం, శ్రీను, సుబ్బారావు, శేషాద్రి, యల్లయ్య, చంద్ర పాల్గొన్నారు.

➡️