ప్రజాశక్తి – భట్టిప్రోలు
వైసిపి అభ్యర్థి వరికూటి అశోక్ బాబు గెలుపును కోరుతూ భారీ ప్రచార ప్రదర్శన సోమవారం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈనెల 13న జరుగునున్న ఎన్నికల్లో ఎంఎల్ఎ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వరికూటి అశోక్ బాబు, బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరిగి వైసిపి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కొనసాగడానికి మరోసారి జగన్మోహన్ రెడ్డిని సిఎంగా గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ ధారా రవికిరణ్మయి, ఎంపీటీసీ కౌతరపు పద్మావతి, గద్దె సుశీల, నాయకులు చెన్నయ్య, కుందేటి రమేష్, అబ్దుల్లా, భూషణ్రావు, రెహమాన్, మద్దుల గిరి, పసుపులేటి శివరాం ప్రసాద్ పాల్గొన్నారు.