ప్రజాశక్తి – అద్దంకి
శాంతి భద్రతలు పరిరక్షణగా విధులు నిర్వహిస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ పి కృష్ణయ్య అన్నారు. బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం వైసిపి ఇన్చార్జి పానెం హనిమిరెడ్డిని వైసీపీ కార్యాలయంలో మర్యాదపూర్వంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/ADK-Hanimi.jpg)