ఐలవరంలో టిడిపి ఇంటింటి ప్రచారం

Nov 23,2023 00:12

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని ఐలవరం, అద్దేపల్లి, పల్లికోన, వెల్లటూరు గ్రామాల్లో బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ నినాదంతో ఇంటింటికి తిరిగి కరపత్రాలు గురువారం పంపిణీ చేశారు. బాబు షూరిటీపై రిజిస్ట్రేషన్‌ చేసి పత్రాలను యువకులకు అందజేశారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. రాను ఎన్నికల్లో టిడిపి, జనసేన ఆధ్వర్యంలో పోటీ చేసే నాయకులకు మెజార్టీ ఇచ్చి గెలుపొందేలా కృషి చేయాలని సూచించారు. టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మాచర్ల నాగరాజు, వామనపల్లి కోటేశ్వరరావు, అనగాని ఏడుకొండలు, దీపాల ప్రసాద్, జగ్గారపు పాపారావు, తాతా వీరాంజనేయులు, ఎడ్ల జయశీలరావు, కంభం సుధీర్, సిరాజుద్దీన్, శ్రీనివాసరావు, బాబురావు పాల్గొన్నారు.

➡️