అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థిని ఎంపిక

Nov 23,2023 00:16

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఈనెల 23నుండి నరసరావుపేటలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సూరేపల్లి విపి అండ్ జిఎస్ఎం ఉన్నత పాఠశాల విద్యార్థిని బొర్ర గీతికశ్రీ ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం శ్రీనివాసశర్మ తెలిపారు. క్రీడా పోటీల్లో డిస్కస్ త్రో విభాగంలో గీతికశ్రీ గుంటూరు జిల్లా జట్టు తరుపున ఆడనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు జీవీఎస్ నాగేశ్వరరావును పాఠశాల పాలకవర్గ అధ్యక్షులు ఏపూరి చలమయ్య, కార్యదర్శి రావు కృష్ణారావు గురువారం అభినందించారు.

➡️