టిడిపి నేతల అరెస్టులు అప్రజాస్వామ్యం : ఎంఎం కొండయ్య

Feb 5,2024 11:23 #Bapatla District
tdp protest against arrest

వైసిపి ప్రభుత్వానికి కాలం చెల్లింది

ప్రజాశక్తి – చీరాల : తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులో అప్రజా స్వామ్యమని రాష్టంలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్ష పార్టీలపై రోజు రోజుకు పోలీసుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయని టిడిపి నియోజకవర్గం ఇంచార్జి ఎంఎం కొండయ్య అన్నారు. టిడిపి నాయకుల అరెస్టులను వ్యతిరేకిస్తూ నిరసనగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే తమ పార్టీ శాసనసభ్యులకు అండగా వెళ్లాలని భావించి అందుకు అనుగుణంగా పిలుపు ఇస్తే అర్ధరాత్రి సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇవ్వటం పలువురు నాయకులును పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణం అన్నారు. తామేమైన ఉగ్రవాదులమా లేక ,తీవ్రవాదుల అని విరుచుకుపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సీఎం జగన్ తన ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తున్నారని ప్రజలు త్వరలోనే బుద్ది చెప్తారని అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కోండ్రు రత్నబాబు, నరాల తిరుపతి రాయుడు,డేటా నాగేశ్వరరావు, సుబ్బలక్ష్మి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

➡️