రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలి

Nov 23,2023 00:19

ప్రజాశక్తి – రేపల్లె
రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ దోహదం చేస్తుందని టిడిపి బూత్ కన్వీనర్ కొక్కిలిగడ్డ ధనుంజయరావు అన్నారు. పెనుమూడి గ్రామంలో బాబు షురిటీ _భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ అనగానే సత్య ప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి మినీ మ్యానిఫెస్టో వివరాలను చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు, ప్రజల కష్టాలు, బాధలు సమస్యలు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టిడిపి ప్రణాళిక ప్రకటించిందని అన్నారు. కార్యక్రమంలో కొక్కిలిగడ్డ శ్రీనివాసరావు, ముప్పాల శ్రీనివాసరావు, నాగిడి నాగరాజు, నాగిడి ఆంజనేయులు, నాగిడి సుబ్రహ్మణ్యం, నాగిడి వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ నాయకురాలు నాగిడి చెంచులక్ష్మి పాల్గొన్నారు.

➡️