ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : పూజ కోసం ఇంటిపై ఉన్న పూలు కోయడానికి డాబాపైకి వెళ్ళిన భర్త ఎంతకీ క్రిందకు రాకపోవడంతో పైకి వెళ్ళిన బార్యకు రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి భయంతో బిగ్గరగా కేకలు పెట్టింది. స్ధానికులు వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. స్ధానికులు, కుటుంబ సభ్యుల కధనం ప్రకారం.. మండల పరిదిలోని వలపర్లకు చెందిన వెచ్చా సుబ్బరాయుడు మార్టూరులో నివాసం ఉంటు నాగరాజుపల్లి సమీపంలో లక్ష్మీసాయి గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఇటీవలే కొణిదెన రోడ్డులోని అపార్ట్ మెంట్ నుండి చౌదరి కాలనికి నివాసం మార్చాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం గుడికి వెళ్ళి వద్దాం రెడీగా ఉండు అని భార్యకి చెప్పి పూలు కోసుకొస్తాని ఇంటి పైకి వెళ్ళిన సుబ్బరాయుడు రక్తపు మడుగులో మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు కాలు జారి పడి మృతి చెందాడా..? మరేదైన కారణాలు ఉన్నాయా ? పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.