పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తాం

May 3,2024 00:49 ##tdp #gottipati

ప్రజాశక్తి – సంతమాగులూరు
ఇల్లు లేని ప్రతి పేదవారికి సొంతింటి కలను నెరవేరుస్తామని టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ తెలిపారు. మండలంలోని పుట్టావారిపాలెంలోని గొట్టిపాటి బీసీ కాలనీలో తన తండ్రి గొట్టిపాటి రవికుమార్‌కు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. టిడిపి అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో తన తండ్రిని గెలిపించాలని కోరారు. కాలనీలో నెలకొన్న త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, ఇంటి సమస్యలను తీరుస్తామన్నారు. జగన్‌రెడ్డికి ఐదేళ్లు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడని అన్నారు. అధికారమే లక్ష్యంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అధికారానికి వచ్చాక వదిలేశాడని అన్నారు. 99శాతం హామీలు నెరవేర్చానని అబద్ధాలు చెబుతూ మరోసారి మోసం చేయడానికి సిద్ధం అయ్యాడని అన్నారు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేకపోవడంతో కొత్త కుట్రలకు తెర లేపేడన్నారు. అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తిస్తుందని చెప్పి తీరా ఒకరికి మాత్రమేనని ఆంక్షలు విధించి రూ.15వేలు కాస్త మెయింటెన్స్ పేరుతో రూ.2వేలు కోత విధించి రూ.13వేలు మాత్రమే ఇచ్చాడన్నారు. ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోలో రూ.17వేలు అమ్మఒడి ఇస్తానని, అది కేవలం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తాననడం మరోసారి మోసం చేయడమేనని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలు స్కూలుకు వెళితే అంతమందికి ఏడాదికి రూ.15లు తల్లుల ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సన్నెబోయిన ఏడుకొండలు, సర్పంచి సన్నెబోయిన గురు యాదవ్, మాదాల సుబ్బారావు, ధూపాటి ఏసోబు, వెంకటేశ్వర్లు, సింబోతుల వీరయ్య, కొనికి శ్రీనివాసరావు, గమిడి కోటేశ్వరరావు పాల్గొన్నారు

➡️