ప్రతి ఇంటికీ సంక్షేమం

Nov 23,2023 00:17

ప్రజాశక్తి – రేపల్లె
గ్రామీణ నిరుపేద కుటుంబాలకు రూ.కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందని వైసీపీ రూరల్ అధ్యక్షుడు గాదె వెంకయ్య బాబు అన్నారు. మండలంలోని నల్లూరులో రాష్ట్రానికి జగనే ఎందుకు అనే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్‌పిటిసి బొర్రా శ్రీనివాసరావు మాట్లాడుతూ సచివాలయ పరిధిలో జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను వివరించాలని అన్నారు. గత ప్రభుత్వం చెయ్యలేని అనేక సంక్షేమ పథకాలను జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. సంక్షేమం ఉంది, కీని అభివృద్ది ఏదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం వేసిన రోడ్లు నాలుగు సంవత్సరాలలో పాడయ్యాయని అన్నారు. తాము ఓట్లు అడగటం లేదని, మంచి జరిగితేనే ఓటు వేయాలని చెప్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. జగన్‌ పాలనలో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని తెలిపారు. నల్లూరు పంచాయితీకి రూ.13కోట్లకుపైగా సంక్షేమ పథకాలు అందించామని అన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఆవశ్యకత గుర్తించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. మరోసారి సిఎంగా జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కోన శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

➡️