లబ్ధిదారులే బ్రాండ్‌ అంబాసిడర్లు

సత్తెనపల్లి రూరల్‌ : వైసీపీ ప్రభుత్వానికి సంక్షేమ లబ్దిదారులే బ్రాండ్‌ అంబాసిడర్లని సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి మండలం ఫణిదం, దీపాలదిన్నెపాలెం, రామచంద్రాపురం గ్రామాల్లో నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తో కలిసి అంబటి రాంబాబు శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా రాంబాబు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు కొనసాగా లంటే వైసిపికి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

➡️