సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని బైక్‌ ర్యాలీ

May 11,2024 16:09 #Alluri District, #cpm, #cpm bike raly

ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం మండల నాయకులు లాగరాయి, రాజవొమ్మంగి, శరభవరం, బోర్నగూడెం, ఉర్లాకులపాడు, సంజీవనగరం, చెరుకుంపాలెం, జడ్డంగి, వట్టిగెడ్డ, సింగంపల్లి, దూసరపాము తదితర గ్రామాల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కాళ్ళ రాజబాబు, పాండవుల సత్యనారాయణ, కుంజం జగన్నాథం, టి.శ్రీను మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే బిజెపిని, దానికి మద్దతిస్తున్న టిడిపి వైసిపి, జనసేనలను చిత్తుచిత్తుగా ఓడించాలని.. సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నిత్యవసర సరుకుల ధరలు పెంచుతూ.. ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీస్తూ గ్రామీణ ప్రజలకు తీవ్ర నష్టం చేకూర్చుతుందన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి బిజెపిని నిలువరించాల్సిన టిడిపి, జనసేన, వైసిపిలు బలపరచడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి రాజ్యాంగ పరిరక్షణకై, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ఇండియా కూటమీకి ఓటు వేసి గెలపించాలని కోరారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి లోతా రామారావు, అరకు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న పాచిపెంట అప్పల నరసకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో సిపిఎం నాయకులు గంగరాజు, ప్రవీణ్‌, దొరబాబు, రామరాజు పెద్ద సంఖ్యలో మహిళలు యువత పాల్గొన్నారు.

➡️