‘శ్రీవారి’ని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Jul 2,2024 16:21 #celebrities, #Tirumala, #visited

ప్రజాశక్తి -తిరుమల : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌ నాద్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మహిళా క్రికెటర్‌ స్మృతి మందన వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

➡️